ఆదోని మండలం పాండవగల్లు శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. గణేకల్లుకు చెందిన యువకులు బైకుపై వెళ్తూ ముందు ఉన్న ఆటోను ఓవర్టేక్ చేసే క్రమంలో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, వీరేశ్తో పాటు ఆటోలో ఉన్న మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై పెద్దతుంబళం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.