మే డే స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన లారీ హమాలి, కోత అంగడి గుమాస్తాల యూనియన్ల సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని నాయకులు విమర్శించారు.