కూటమి ప్రభుత్వం ప్రకటించిన 2025 డీఎస్సీ నోటిఫికేషన్లో భారీ అవకతవకలు జరిగాయని, దీనిపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని వారు ఆరోపించారు.