కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన రూ. 65,000 ఆర్థిక సహాయాన్ని గురువారం కర్నూలులోని తన కార్యాలయంలో ఆస్పరి మండలం జోహారాపురం గ్రామానికి చెందిన తలారి విమల్ నాయుడు దంపతులకు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కవల పిల్లల చికిత్స ఖర్చుల కోసం ఈ సహాయం మంజూరైంది. సీఎంఆర్ఎఫ్ సాయం అందించడంలో కృషి చేసిన ఎంపీ నాగరాజుకు లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపారు.