కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, గురువారం రైతు బజార్లలో మౌలిక సదుపాయాలపై మార్కెటింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని రైతు బజార్లలో శానిటేషన్, తాగునీరు, మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు సమర్థవంతంగా కల్పించాలని, సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.