కర్నూలు నగరంలోని లక్ష్మినగర్కు చెందిన లక్ష్మి ప్రసన్న అనే ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. అక్టోబర్ 30న ఉదయం కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు, బంధువులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.