ప్రభుత్వ ఆస్పత్రి ప్రసవాల్లో కర్నూలు జిల్లాకు అగ్రస్థానం

10చూసినవారు
ప్రభుత్వ ఆస్పత్రి ప్రసవాల్లో కర్నూలు జిల్లాకు అగ్రస్థానం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యధిక ప్రసవాలు నిర్వహించి కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు 5,500 ప్రసవాల లక్ష్యం కాగా, 145 శాతంతో 7,982 ప్రసవాలు జరిగాయని పేర్కొన్నారు. లక్ష్యానికి మించి సేవలందించడంలో జిల్లా టాప్‌లో నిలిచిందన్నారు. మెరుగైన వైద్య సేవలు అందడం వల్లే ఈ రికార్డు సాధ్యమైందని ఆమె వివరించారు.