కర్నూలు అర్బన్ పరిధిలోని సంతోష్ నగర్ లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక టిప్పర్ బైక్ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.