శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు శనివారం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 10 మంది భక్తులు మృతి చెందడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కర్నూలు బస్సు ప్రమాదం తరువాత మరో దుర్ఘటన తీవ్రతను పెంచిందని తెలిపారు.