కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవనాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కమిషనర్ పి. విశ్వనాథ్తో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని, రూ. 28 కోట్లతో చేపట్టిన ఈ భవనంలో సుమారు 50% పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.