కర్నూలు ఎస్ఎఫ్ఐ నాయకులు ఎన్టీఏ,
నీట్ వంటి కేంద్ర పరీక్షా వ్యవస్థలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యా కేంద్రీకరణకు వ్యతిరేకంగా జూన్ 3 నుంచి 6 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం జరిగిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో,
నీట్, సీయూసెట్, యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, పేపర్ లీకులు, అవకతవకలతో
విద్యార్థులు నష్టపోతున్నారని నాయకులు విమర్శించారు.