సోమవారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పి. జి. ఆర్. ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతతో పనిచేయాలని, ప్రతి అర్జీపై సమగ్రంగా పరిశీలించి, వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.