కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పదవీ విరమణ పొందిన ఎస్సై ఎ. మహబూబ్ భాషాను శుక్రవారం కర్నూలులో సన్మానించారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్లో సేవలందించిన మహబూబ్ భాషాకు ఎస్పీ కార్యాలయంలో శాలువ, పూలమాలతో జ్ఞాపిక అందజేశారు. కుటుంబంతో సంతోషంగా గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, పోలీసు సంఘం అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.