కర్నూలు జిల్లాలో పెండింగ్లో ఉన్న 22ఏ భూముల తొలగింపు ప్రక్రియను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ తహసిల్దార్లను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. రీ-సర్వే ప్రక్రియలో 5వ దశలో కొనసాగుతున్న ఈ-కేవైసీ గ్రౌండ్ ట్రూతింగ్ పనులను సక్రమంగా నిర్వహించాలని, రైతుల నుంచి ఈ-కేవైసీ తీసుకోవడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.