కర్నూలు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా బెనిఫిట్ శాచురేషన్ క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. శనివారం కర్నూలులో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఏడుగు గ్రామాల్లో గృహాలు, రోడ్లు, నీటి సరఫరా, పింఛన్లు, ఆయుష్మాన్, రేషన్ కార్డులు తదితర 17 శాఖల సేవలు కల్పించనున్నారు.