2026 నూతన సంవత్సరంలో కర్నూలు జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ఓ సి. వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది కలెక్టర్ను కలిసి పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు అధికారులు కష్టపడి పని చేయాలని కలెక్టర్ సూచించారు.