సి.బెళగల్ మండలం పోలకల్లో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. బీసీ కాలనీలో ట్రాక్టర్ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లో ఉన్న ఆదోని కౌకుట్ల(48) అనే మహిళను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.