హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ను ఆలూరు వైసిపి ఎమ్మెల్యే విరుపాక్షి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ భేటీలో రాయలసీమ అభివృద్ధి, బీసీ వర్గాల సంక్షేమం తదితర అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. హైదరాబాదులో శాంతి భద్రతలు మెరుగుపడేందుకు పోలీసులు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే విరూపాక్షి ప్రశంసించారు.