కర్నూలు నగరంలో అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన, ప్రక్రియ పూర్తి చేసేందుకు నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో (గురు, శుక్రవారాల్లో) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎస్ఆర్ఎస్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారు అవసరమైన పత్రాలతో హాజరై ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.