మంత్రాలయం - Mantralayam

హెచ్ మురవణిలో ఉచిత రక్తదాన శిబిరం

హెచ్ మురవణిలో ఉచిత రక్తదాన శిబిరం

80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో పెద్దకడబూరు మండలం హెచ్. మురవని గ్రామంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి చిన్నయ్య, ఉప్పర నాగరాజు, ఈడిగ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 40 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రతి ఏడాది ఆగస్టు 15న రక్తదాన శిబిరం నిర్వహించడం ఇది నాలుగోసారి అని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సాగునీటి సంఘం ప్రతినిధి ఈడిగ సత్తన్నగౌడ్, ఎంపీటీసీ ఉప్పర జనార్ధన్, కురువ సంఘం మండల అధ్యక్షుడు రామలింగ తదితరులు పాల్గొన్నారు.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా
పేద విద్యార్థులకు ఫ్రీగా ఆన్‌లైన్ కోచింగ్ ఇప్పిస్తాం: మోదీ
Aug 15, 2026, 16:08 IST/

పేద విద్యార్థులకు ఫ్రీగా ఆన్‌లైన్ కోచింగ్ ఇప్పిస్తాం: మోదీ

Aug 15, 2026, 16:08 IST
ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు యువతే కీలకమని అన్నారు. దేశానికి యువతే అతిపెద్ద శక్తి అని, వారే తమ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై మోదీ ప్రసంగించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తామన్నారు. రాబోయే ఏడాదిలో కోటి మందికి AI శిక్షణ ఇస్తామని ప్రకటించారు. 2014కు ముందు 400 మెడికల్ సీట్లు ఉండగా, ప్రస్తుతం 800కి పెంచామని, దేశంలో 350కి పైగా విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయని తెలిపారు.