మంత్రాలయం నియోజకవర్గంలోని మాధవరం చెక్పోస్టు వద్ద కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న గుల్బార్గాకు చెందిన నరసింహను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ ప్రసాద్ రావు, ఎమ్మిగనూరు ఎక్సైజ్ సీఐ మొహిద్దీన్ బాషా నేతృత్వంలో మోటార్ సైకిల్లో తరలిస్తున్న 192 టెట్రా ప్యాక్ మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, బైక్ను సీజ్ చేశారు. నిందితుడిని ఎమ్మిగనూరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.