మాధవరం: టీడీపీ–వైసీపీ శ్రేణుల ఘర్షణ.. కారు, బైక్ దహనం

0చూసినవారు
మాధవరం: టీడీపీ–వైసీపీ శ్రేణుల ఘర్షణ.. కారు, బైక్ దహనం
మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం కోసిగిలో ధర్నాకు వెళ్తున్న వైసీపీ కార్యకర్తలు మాధవరంలోని టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్రరెడ్డి ఇంటి ముందు జెండాలు ప్రదర్శించి, బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలో ఓ మహిళతో వాగ్వాదం జరిగింది. అనంతరం కోసిగి నుంచి తిరిగి వస్తున్న వైసీపీ శ్రేణుల వాహనాలను టీడీపీ కార్యకర్తలు అడ్డగించడంతో ఓ కారు, బైక్‌కు నిప్పంటించి దగ్ధం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్