కర్నూలు జిల్లాలోని పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్ను 2025 సంవత్సరానికి గాను రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. శుక్రవారం విజయవాడలో డీజీపీ హరీష్కుమార్ గుప్తా చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. నేర నియంత్రణ, త్వరిత దర్యాప్తు, సీసీ కెమెరాల అమలు వంటి అంశాలలో ఈ ఘనత సాధించినట్లు అధికారులు తెలిపారు.