నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బ్రహ్మనాకోట్కూరు గ్రామ సచివాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పారదర్శక, సమర్థవంతమైన పాలన లక్ష్యంగా ప్రజా సేవల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పునఃసర్వే పనుల పురోగతి, పట్టాదారు పాస్బుక్ల పంపిణీ ప్రక్రియను ఆమె సమీక్షించారు. ప్రజలకు సేవలు వేగవంతంగా, పారదర్శకంగా అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.