డోన్లో ఆర్టీఓ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 31 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డోన్, బేతంచెర్ల, ప్యాపిలి ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు చేపడతామని అధికారులు తెలిపారు. ప్రజలు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు కోరారు.