బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ గోవుల రవాణాను అరికట్టేందుకు బ్రాహ్మణకోట్కూరు మండలం కొల్లబాపురం వద్ద అంతర్జిల్లా చెక్పోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఎస్సై వి. మణికంఠ తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, చట్టవ్యతిరేకంగా గోవులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.