నంద్యాల కలెక్టరేట్లో శనివారం తుఫాను ప్రభావంపై సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య పాల్గొన్నారు. పంట నష్టం, నీట మునిగిన రైతుల పునరావాస చర్యలపై అధికారులు సమగ్ర నివేదికను సమర్పించారు.