తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకత్వంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజలకు మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు. ఆమె లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత శక్తివంతంగా ఎదిగి ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరుకున్నారు.