ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు భవిష్యత్తుకు కీలకమని, ప్రతి ఒక్కరూ తమ ఓటును ధృవీకరించుకోవాలని సూచించారు. జనన తేదీ ఆధారంగా అవసరమైన పత్రాల వివరాలు వెల్లడించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వస్తారని, ప్రజలు ముందుగానే పత్రాలు సిద్ధం చేసుకోవాలని కోరారు.