నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న బెలుం గుహలు అరుదైన గుర్తింపును పొందాయి. ఈ గుహలకు జీఎస్ఐ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ విషయంపై స్పందించిన మంత్రి దుర్గేష్. హర్షం వ్యక్తం చేశారు. వారసత్వ జాబితాలో బెలుం గుహలు చేరడం నిజంగా ఆనందంగా ఉందని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.