నంద్యాల: లిక్కర్ స్కాం సూత్రధారి అరెస్టు పై డిమాండ్

నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కమిటీ గత ప్రభుత్వ లిక్కర్ స్కాం ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వ చర్యలను అభినందిస్తూ, అవుకు కస్తూర్బా పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
