నంద్యాల జిల్లాలో శనివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మహానందిలో 61.4 మి.మీ వర్షపాతం నమోదైంది. బలమైన గాలుల కారణంగా అరటి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. బండిఆత్మకూరు మండలంలో రహదారులపై చెట్లు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటనలతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.