నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, క్యాన్సర్ బాధితుడు తంబాళ్లి వీరకుమార్ కుటుంబానికి అండగా నిలిచారు. బొమ్మలసత్రం కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్లో వీరకుమార్ కుటుంబం తమ సమస్యను ఎంపీ దృష్టికి తీసుకురాగా, హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో DOTATATE థెరపీకి అవసరమైన ₹2.40 లక్షల అనుమతి పత్రాన్ని ఆమె మంజూరు చేయించారు. ఎంపీ చొరవతో చికిత్సకు మార్గం సుగమమైందని బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.