ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్తో పాటు అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.