నంద్యాల ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు, పట్టణంలోని ఆదర్శ పాఠశాల, ఉమెన్స్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినులకు శక్తి టీం సభ్యులు ప్రత్యేక అవగాహన కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ డి.ఎన్. ప్రసాద్, రఫీ, వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థినుల మొబైళ్లలో శక్తి యాప్ను డౌన్లోడ్ చేయించారు. ఆపద సమయంలో యాప్ వినియోగం, సైబర్ నేరాలపై అప్రమత్తత గురించి వివరించారు.