నంద్యాల ప్రజల గుండెల్లో తమ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. శిల్పా మహిళా సహకార బ్యాంక్ ద్వారా 141 మంది మహిళలకు రూ. 24.58 లక్షల రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలకు రాజకీయంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. టెక్కె మార్కెట్ యార్డు షాపింగ్ కాంప్లెక్స్లో కొనసాగుతున్న సంస్థలను ఖాళీ చేయించేందుకు నోటీసులు ఇవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.