కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి బుధవారం కల్లూరు మండలంలోని పెద్దటేకూరు, తడకనపల్లెలలో పంటలను పరిశీలించి, రైతులకు ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన మందుల వాడకాన్ని తగ్గించి, రెండు, మూడు రకాల పంటలను సాగు చేయాలని, పాడి పశువుల పెంపకం ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందని తెలిపారు.