పసుపు పండుగ వర్చువల్ మహానాడు–2026ను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలకవీటి విజయకుమార్ పిలుపునిచ్చారు. కర్నూలులోని కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పార్టీ కార్యాలయం సూచించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని, క్లస్టర్ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు అన్ని విభాగాల నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.