శుక్రవారం కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి ఓర్వకల్లు మండలానికి చెందిన నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, రాంమోహన్ రెడ్డి అనే రైతులకు ఇనాం భూములను పట్టా భూములుగా, ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చిన దరఖాస్తులను పరిష్కరించి ప్రొసీడింగ్స్ను అందజేశారు. అర్హులైన రైతుల భూసమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.