పాణ్యం మండలం బలపనూరు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రకు చెందిన స్కార్పియో వాహనం తిరుపతికి వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. హైవే సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.