కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్రంగా విమర్శించారు. సోమవారం కర్నూలు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి బెంచ్ ను దూర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించడం తప్పు అని పేర్కొన్నారు. బెంచ్ నగరంలో ఉండటమే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని, రాజకీయ ప్రయోజనాల కోసం భ్రమాత్మక ప్రచారం చేయవద్దని ఆయన స్పష్టం చేశారు.