కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ జేసీ నూరుల్ క్వామర్ మంగళవారం తుగ్గలి మండలం బోల్లవానిపల్లి గ్రామంలో పర్యటించారు. భూగర్భజలాలు కలుషితమై పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఫిర్యాదు మేరకు ఆయన పండ్ల తోటలను పరిశీలించారు. పత్తికొండ ఆర్డీవో డాక్టర్ భరత్ నాయక్, తహశీల్దార్ రవి, ఇతర అధికారులతో కలిసి తోటల పరిస్థితిని సరిచూసి, నష్టంపై ఆరా తీసి, పరిష్కార చర్యలపై సూచనలు ఇచ్చారు.