కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మంగళవారం మద్దికెర తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి, గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో, రెవెన్యూ, మండల పరిషత్, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, విద్య, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు పాల్గొన్నారు.