ఆత్మకూరు DSP రామంజి నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం “సేఫ్టీ ఫస్ట్–హెల్మెట్ మస్ట్” నినాదంతో హెల్మెట్ అవగాహన ర్యాలీ జరిగింది. టౌన్, రూరల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో కలిసి అధికారులు స్వయంగా హెల్మెట్ ధరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహన దారుల ప్రాణనష్టం అధికమవుతోందని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని DSP సూచించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.