అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, నిధుల విడుదల, మరియు పలు ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా పెండింగ్ పనులను వేగవంతం చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.