బనగానపల్లె వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబుల్ రెడ్డి "వెన్నుపోటుకు రెండేళ్లు" పోస్టర్ను విడుదల చేశారు. జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మహానాడులో రాష్ట్ర అభివృద్ధిపై చర్చ లేకుండా వైఎస్ జగన్పై విమర్శలకే పరిమితమయ్యారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, కొత్త పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీల అమలుపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.