శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో గడచిన 24 గంటల్లో 3.909 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఈ ఉత్పత్తికి 8,514 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. పోతిరెడ్డిపాడుకు 2,000 క్యూసెక్కులు, హెచ్ఎన్ఎస్ఎస్కు 2,832 క్యూసెక్కులు, కల్వకుర్తికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 136 క్యూసెక్కులు ఆవిరైపోయాయి.