ఆదోని-ఎమ్మిగనూరు బైపాస్ రోడ్లో నెట్టేకల్ సమీపంలోని మధు వెజిటబుల్ నర్సరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నర్సరీలోని సీడ్స్, ఎరువు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. నర్సరీ నిర్వాహకురాలు గంగలమ్మ తెలిపిన ప్రకారం.. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.