గోనెగండ్ల మండలం గంజహళ్లిలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టారు. మంగళవారం, గ్రామస్తులు వడ్ల నరసింహ ఆచారి, దాసన్నగారి రమేష్ ఈ సమస్యను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యలకు స్పందించి, ఆమె వెంటనే ఈ విషయాన్ని బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ దృష్టికి తీసుకెళ్లారు.