ఎమ్మిగనూరులో 70 సంవత్సరాలుగా లెదర్ సొసైటీ షేర్ హోల్డర్స్ న్యాయం కోసం బుధవారం సోమప్ప సర్కిల్లో రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. దళిత షేర్ హోల్డర్స్ను మోసం చేసిన చైర్మన్ రఘునాథ తారకేస్పై జైభీమ్ ఎమ్మార్పీఎస్ టౌన్ నాయకులు కదిరికోట రాజు, సంధ్య హనుమంతు మద్దతు తెలిపారు. బాధితులకు ఆర్థిక పరిహారం, ఉపాధి, న్యాయం కల్పించే వరకు అమరావతి వరకు పోరాటం కొనసాగిస్తామని వారు ప్రకటించారు. న్యూ లైఫ్ స్వచ్ఛంద సేవసంస్థ నిర్వాహకులు సామెల్, నేతలు గురజాల జాన్, అశోకు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.